![]() |
![]() |
.webp)
'కార్తీకదీపం' సీరియల్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.అయితే శుక్రవారం జరిగిన ఎపిసోడ్-1555 లో మోనిత గురించి ఆలోచిస్తూ.. దీప పరధ్యానంతో వంట చేస్తూ ఉంటుంది. కార్తీక్ వస్తాడు. దీప పరధ్యానం చూసి అడుగుతుంటాడు. కార్తీక్ మాట్లాడుతూ "ఏంటీ దీప.. మోనిత గురించి ఆలోచిస్తున్నావా? దాని గురించి ఎందుకు పట్టించుకుంటావ్. దాని సంగతి నేను చూసుకుంటా.. నువ్వేం ఆలోచించకు" అని చెప్తాడు. కార్తిక్ ఎంత చెప్పినా దీప మౌనంగా ఉండిపోతుంది. "అసలా మోనిత మన దగ్గరికి రాలేదనుకో, మోనిత మన దగ్గరికి రాకుండా ఏం చెయ్యాలో నాకు తెలుసు" అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తిక్.
మోనిత ని కలవడానికి కార్తీక్ వస్తాడు. "మోనిత.. నీతో మాట్లాడాలి" అని కార్తిక్ అంటాడు. "మాట్లాడు కార్తీక్..ఒక్కసారి నా చెయ్యి పట్టుకో, అంతులేని సంతోషాన్ని అందిస్తాను" అని మోనిత అంటుంది. "మా జోలికి రావొద్దు" అని కోపంగా చెప్తాడు కార్తిక్. "ఇకనుండి మా దగ్గరికి రావొద్దు.. మమ్మల్ని వదిలెయ్" అని కార్తిక్ ఎంత చెప్పినా వినకుండా అలాగే ప్రవర్తిస్తుంది మోనిత.
ఆ తర్వాత దీప దగ్గరికి మోనిత వస్తుంది. "డాక్టర్ బాబు గురించి ఎదురుచూస్తున్నావా"
అని అడుగుతుంది. "నీకు ఎందుకే" అని దీప కోప్పడుతుంది. "నీ గురించి మాట్లాడటానికే, కార్తీక్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు. నిన్ను ప్రశాంతంగా ఉంచాలని అడిగాడు. నేను ఒప్పుకోకపోయేసరికి, కోపంగా అక్కడి నుండి వచ్చాడు. నా కోరికకు నువ్వు అయినా ఓకే చెప్తావా? నా కోరిక సింపుల్. నేను మీతో కలిసి ఉంటాను. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చెయ్యను" అని మోనిత అడుగుతుంది. అలా అనగానే "చెప్పు తెగుద్ది" అని దీప అంటుంది. మోనిత మాట్లాడుతూ "మీ పెళ్లి అయినప్పటి నుండి మీరు సంతోషంగా ఉన్నారు. ఇక కార్తీక్ ని నాకు అప్పగించు. పోయేలోపు ఈ ప్రపోజల్ తో నువ్వే నా దగ్గరికి వస్తావ్ చూడు" అని మోనిత అంటుంది. ఆ తర్వాత "మళ్ళీ కలుద్దాం" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మోనిత.
ఒకవైపు హిమ, శౌర్యలు వాళ్ళ అమ్మ నాన్నలను వెతుకుతుంటారు. అలా వెతుకుతున్నప్పుడు హేమచంద్ర ఎదురుపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మరో ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |