ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమాలో ఈ డైలాగ్ చెప్తాడు. ఏ ముహూర్తాన చెప్పాడో గాని ఇప్పుడు మహేష్ సృష్టించే నయా రికార్డుల దెబ్బకి పాత రికార్డుల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది.
మహేష్ వన్ మాన్ షో గుంటూరు కారం. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి రికార్డు కలెక్షన్స్ ని సృష్టించింది. ముఖ్యంగా సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే భారీ స్థాయిలో రెస్పాన్స్ ని అందుకుంది. వయసుతో సంబంధం లేకుండా అందరు థియేటర్స్ లో ఒకటే గంతులు. పైగా ఆ సాంగ్ కి సోషల్ మీడియాలో రీల్స్ కూడా రికార్డు స్థాయిలో వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 200 మిలియన్ వ్యూస్ ల మైలురాయిని చేరుకుంది. ఈ విషయాన్ని ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ఒక పోస్టర్ ద్వారా వెల్లడి చేసింది.
ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో మెయిన్ హైలెట్ గా నిల్చింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. మహేష్ అండ్ శ్రీలీల ఈ పాటలో పోటీ మరి డాన్స్ చేసారు.తమన్ సంగీత సారధ్యంలో తెరకెక్కగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. సాహితి, శ్రీ కృష్ణ లు ఆలపించారు. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి రచన చేసాడు.గుంటూరు కారాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై రాధా కృష్ణ నిర్మించగా త్రివిక్రమ్ దర్శకత్వాన్ని వహించాడు.