![]() |
![]() |

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) మరోసారి యాక్షన్ బాట పడుతున్నాడు. గతేడాది 'ఆంధ్ర కింగ్ తాలూకా'తో ప్రేక్షకులను పలకరించిన రామ్.. తన నెక్స్ట్ మూవీని ఒక నూతన దర్శకుడితో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఆ దర్శకుడు మరెవరో కాదు, సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) వద్ద అసోసియేట్గా పనిచేసిన లోగి విఘ్నేష్ అని తెలుస్తోంది.
లోకేష్ మార్క్ యాక్షన్.. రామ్ ఎనర్జీ
లోకేష్ కనగరాజ్ సినిమాల్లో ఉండే రా అండ్ రస్టిక్ యాక్షన్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన శిష్యుడైన విఘ్నేష్ కూడా అదే తరహాలో రామ్ కోసం ఒక పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ కథను సిద్ధం చేశాడట. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని, రామ్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రం న్యూ-ఏజ్ యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతోందని సినీ వర్గాల టాక్.
ఆంధ్ర కింగ్ నిరాశ తర్వాత.. ఆచితూచి అడుగులు!
రామ్ పోతినేని గత చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా' విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో రామ్ తన నెక్స్ట్ సినిమా విషయంలో దాదాపు ఆరు నెలల పాటు గ్యాప్ తీసుకున్నాడు. ఎన్నో కథలు విన్న తర్వాత, చివరకు లోకేష్ కనగరాజ్ శిష్యుడు చెప్పిన విభిన్నమైన పాయింట్కు ఫిదా అయ్యి ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
కొత్త లుక్లో ‘ఉస్తాద్’..
ఈ సినిమా కోసం రామ్ సరికొత్త మేకోవర్లో కనిపించనున్నట్లు సమాచారం. యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకోనున్నాడట. లోకేష్ టీమ్ నుంచి వస్తున్న దర్శకుడు కావడంతో, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(LCU) తరహాలో ఈ ప్రాజెక్టులో ఏవైనా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయేమోనని అభిమానులు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
అనౌన్స్మెంట్..
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ని ఈ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |