Home  »  News  »  రానా దగ్గుబాటి సంచలన నిర్ణయం!

Updated : Jan 22, 2023

టాలీవుడ్ లోని బడా బడా నిర్మాణ సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్ ను ముందుగా చెప్పుకోవాలి. డి.రామానాయుడు ఉన్నంతకాలం ఈ బ్యానర్ కు పోటీ అనేది లేకుండా పోయింది. ఆ తరువాత ఈ బ్యానర్ డి సురేష్ బాబు చేతిలోకి వచ్చింది. కానీ ఎందువలనో ఏమో గానీ  ఈయన డి రామానాయుడు లా వరుస చిత్రాలను నిర్మించడం లేదు. మరి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దాంతో ఈ బ్యానర్ నుండి వచ్చే చిత్రాల సంఖ్య కూడా విపరీతంగా తగ్గిపోయింది. పెద్దగా సినిమాలు తీయడంపై సురేష్ బాబు దృష్టి సారించడం లేదు. అందులోనూ ఆయన తీసిన కొన్ని చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఏది ఏమైనా తన తండ్రి రామానాయుడుకు ఉన్న గట్స్ సురేష్ బాబుకు లేవనే చెప్పాలి. 

ఇక తాజా విషయానికి వస్తే రామానాయుడు మనవడు, సురేష్ బాబు తనయుడైన దగ్గుబాటి రానా దేశవ్యాప్తంగా పాన్  హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇటీవల కాలంలో మొదటగా పాన్ ఇండియా రేంజ్ హీరోగా ఎదిగిన హీరో అంటే దగ్గుబాటి రానా అని చెప్పుకోవాలి. ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయమయ్యారు. తర్వాత తమిళం, హిందీ భాషల్లో వివిధ సినిమాలు చేసి గుర్తింపును సాధించి పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో అయ‌న  కృష్ణం వందే జగద్గురుం, రుద్రమదేవి, బాహుబలి 1 ,బాహుబలి 2, నేనే రాజు నేనే మంత్రి వంటి పలు హిట్ చిత్రాలలో  నటించారు. ముఖ్యంగా బాహుబలి రెండు భాగాలలో ఆయన చేసిన భ‌ల్లాల దేవా పాత్ర విల‌నే అయిన‌ప్ప‌టికీ  ఆయ‌న న‌ట‌న‌కు  విపరీతమైనక్రేజ్ ని  తీసుకొని వచ్చింది. నేనే రాజు నేనే మంత్రి, కృష్ణం వందే జగద్గురుం, రుద్రమదేవి వంటి చిత్రాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. కాగా ఇటీవల ఆయన  తెలుగులో అరణ్య చిత్రం  చేశారు.  ఈ చిత్రం విభిన్న‌మైన జోన‌ర్లో సాగే చిత్రం. ఇందులో రానా నటన అద్భుతం అని చెప్పాలి. 

ఇక ఈయన హీరోగా నటించిన చివరి చిత్రం విరాటపర్వం. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి నటించింది.  కాన్సెప్ట్ ఎంతో బాగున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. గతంలో గుణశేఖర్ రానా దగ్గుబాటితో హిరణ్య కశ్యప అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కానీ రానా ఆచిత్రాన్ని  కూడా ప‌క్క‌న పెట్టేశారు. దీనిపై అస‌లు అప్ డేట్సే లేవు.  కొత్త చిత్రాలకు ఆయన సైన్ చేయడం లేదు. దీంతో ఆయన న‌ట‌న‌కు  గుడ్ బై చెబుతున్నార‌ని  ప్రచారం సాగుతోంది. అనారోగ్య కారణాలతో ఆయన ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. రానా చాలాకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నార‌ని స‌మాచారం. ఆయన అమెరికాలో ఉండి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నార‌ట‌. ఈ  సమయంలో రానా విపరీతంగా బరువు తగ్గారు. అంతేకాక ఆయనకు పుట్టుకతో ఒక కన్ను కనిపించదు. మొత్తంగా సినిమాలు మానేయలానే రానా నిర్ణయం తీసుకున్నాడట. జీవితం కంటే కెరీర్ ముఖ్యం కాదని రానా దగ్గుబాటి భావిస్తున్నాడ‌ని స‌మాచారం. దాంతో చాలామంది రానా నిర్ణయమే సరైనది అంటున్నారు. ఇక ఆయన ప్రస్తుతం బాబాయి వెంకటేష్ తో కలిసి రానా  నాయుడు టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేశారు. ఇది హాలీవుడ్ సిరీస్కి  రీమేక్. నెట్ ఫ్లిక్స్‌లో త్వరలో స్ట్రీమ్మింగ్ కానుంది. కాగా  2020లో రానా మీహిక బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లాక్డౌన్ సమయంలో అత్యంత సన్నిహితులుగా మెరిగిన  వీరి మధ్య ప్రేమ చిగురించి అది వివాహానికి దారి తీసింది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.