రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అనుభవించు రాజా'. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ టీజర్ ను తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్. కంప్లీట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది.
'ఉయ్యాలా జంపాలా' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21f సినిమాలతో అలరించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు. అయితే ఆ తరువాత పలు సినిమాలు చేసినా ఆయనకు సరైన హిట్ దక్కలేదు. దీంతో తన తదుపరి సినిమా 'అనుభవించు రాజా' పైనే ఆశలు పెట్టుకున్నాడు రాజ్ తరుణ్. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. టీజర్ బట్టి చుస్తే ఈ మూవీ భీమవరం కోడిపందాల నేపథ్యంలో సాగే సినిమా అని అర్థమవుతోంది. ఇందులో బంగారం అనే పాత్రలో రాజ్ తరుణ్ తన మార్క్ కామెడీ టైమింగ్ తో నవ్విస్తున్నాడు.
'అనుభవించు రాజా' మూవీ టీజర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన రామ్ చరణ్.. మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. మరి రాజ్ తరుణ్ ఈ మూవీతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.