![]() |
![]() |
తెలుగునాట హవా సాగిస్తున్న కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. జయాపజయాలకు అతీతంగా కెరీర్ లో దూసుకుపోతోందీ బుట్టబొమ్మ. ఒకవైపు కథానాయికగా అలరిస్తూనే.. మరోవైపు అతిథి తరహా పాత్రల్లోనూ, ప్రత్యేక గీతాల్లోనూ ఎంటర్టైన్ చేస్తోంది పూజ.
ఇదిలా ఉంటే, `రంగస్థలం` (2018) తరువాత మళ్ళీ ఐటమ్ సాంగ్స్ జోలికి వెళ్ళని పూజ.. `ఎఫ్ 3`లో స్పెషల్ గా చిందులేయబోతున్నట్లుగా తాజాగా ప్రచారం ఊపందుకుంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ ప్రత్యేక గీతం కోసం పూజా హెగ్డే అక్షరాలా రూ. 1 కోటి పారితోషికం అందుకోనుందట. వాస్తవానికి, రూ. 1.25 కోట్ల మొత్తం డిమాండ్ చేసిందట అమ్మడు. అయితే, ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మాణంలో ఇప్పటికే `డీజే` (2017), `మహర్షి` (2019) చిత్రాలు చేసిన నేపథ్యంలో.. ఆ అనుబంధం రీత్యా రూ. 1 కోటికి ఫిక్సయిందని టాక్. ఏదేమైనా.. ఒక్క పాట కోసం రూ. 1 కోటి రెమ్యూనరేషన్ అంటే కచ్చితంగా టాక్ ఆఫ్ ఇండస్ట్రీనే. మరి.. `ఎఫ్ 3`లో పూజ స్పెషల్ సాంగ్ పై వస్తున్న కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
కాగా, అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న `ఎఫ్ 3`లో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, స్టన్నింగ్ బ్యూటీ మెహ్రీన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వేసవి కానుకగా మే 27న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు రానుంది
![]() |
![]() |