Home » Articles » మట్టి వినాయకుడినే ఎందుకు పూజించాలి

మట్టి వినాయకుడినే ఎందుకు పూజించాలి ?

 

 



మట్టిలోంచే సకల ప్రాణులు, సంపదలు వచ్చాయని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అది ఒక కారణమైనా..మట్టి వినాయకుని చేయాలంటే చెరువుల నుంచి బంకమట్టిని సేకరించాలి. ఇంటికో గంపెడు మట్టి తీయడంవల్ల, అందరూ తమకు తెలియకుండానే తలో చెయ్యివేసి, చెరువుల్లో పూడిక తీసినట్టవుతుంది. చెరువుల్ని బాగు చేసినట్టవుతుంది. ఇదీ ఓ కారణమైనా..అసలు కారణం మరొకటి ఉంది. అసలు వినాయకుడు పుట్టింది పార్వతీదేవి మేని నలుగు మట్టి నుంచే కదా. అందుకే ఆయన విగ్రహాన్ని మట్టితోనే చేయాలి. మట్టి వినాయకునే పూజించాలి.

 

More...