ఇండియా గెలిస్తే మిథాలీరాజ్‌కు బీఎండబ్ల్యూ కారు..

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ భారత్-ఇంగ్లాండ్ జట్ల లార్డ్స్‌లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ కోసం దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురచూస్తోంది. ఈ పోరులో గెలిస్తే, మిథాలీ రాజ్‌కు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందిస్తానని మాజీ క్రికెటర్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ ఛైర్మన్ చాముండేశ్వరీనాథ్‌ ప్రకటించారు. ఈ కారును భారతరత్న సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఇప్పించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. క్రీడలను, క్రీడాకారులను ప్రొత్సహించాలన్న ఉద్దేశ్యంతోనే తాను ఈ బహుమతిని ఇస్తున్నట్లు తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో అద్భుతంగా రాణించి దేశ ఖ్యాతిని చాటిన పీవీ సింధు, దీపా కర్మాకర్, సాక్షి మాలిక్‌లకు చాముండేశ్వరీనాథ్ బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చారు.