ఇక ఎన్నికల్లో పోటీచేయను... వెంకయ్యనాయుడు
posted on May 16, 2015 11:37AM

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్ననేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన శుక్రవారం జరిగిన చిగురుపాటి నాగేశ్వరరావు వర్దంతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను జీవితంలో ఇక ఎన్నికల్లో పోటీ చేయనని, తానే కాదు తన కుటుంబసభ్యులు కూడా పోటీ చేయరని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగానని, ఎమ్మెల్యేగా ఉన్పప్పుడు అసెంబ్లీ సీటు వదిలి వెళ్లేవాడిని కాదని... ఇప్పుడు కొందరు ఎంపీలు మాత్రం ఏదో విహారయాత్రకు వచ్చి వెళుతున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ 'ఆయన నిద్రపోరు.. నన్ను నిద్రపోనివ్వరూ' అని చలోక్తులు విసిరారు. కొన్ని పార్టీలు మాత్రం 'ఆయన తినరు మమ్మల్ని తిననివ్వరు అని' అనుకుంటున్నారని ఎద్దేవ చేశారు. భూసేకరణతో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, భూసేకరణ చట్టంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.