యాదాద్రి లో కూలిన విమానం

 

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ విమానం కుప్పకూలింది. హకీమ్ పేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఎయి‌ర్‌ ఫోర్స్ శిక్షణా విమానం యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద  కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం కాలి బూడిదైంది. కాగా ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే అప్రమత్తమైన పైలట్ పారాష్యూట్ సహాయంతో ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. పైలెట్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగేశ్‌గా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే ఆర్మీ వైద్యులు మరో హెలికాఫ్టర్‌లో ప్రమాదస్థలికి చేరుకుని పైలెట్‌కు వైద్యం అందజేశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.