ఉన్మాది కాదు.. చైన్ స్నాచర్!

 

తిరుమల నడకదారిలో తంజావూరుకు చెందిన త్యాగరాజన్, లత అనే భార్యాభర్తల మీద దాడి చేసి గొంతులు కోసిన వ్యక్తి ఉన్మాది కాదని.. చెయిన్ స్నాచర్ అని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలి మెడలో ఉన్న బంగారు ఆభరణాల కోసమే కోసమే ఆ దాడి జరిగి వుండవచ్చని తాము భావిస్తున్నామని తెలిపారు. దాడి ఎవరు చేసి వుంటారనే పరిశోధనలో భాగంగా తాము పాత నేరస్థుల వివరాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. కాగా, దాడిలో గాయపడిన భార్యాభర్తలు ప్రస్తుతం తిరుపతిలోని రూయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 72 గంటల పాటు ఇద్దరినీ డాక్టర్లు పరిశీలనలో వుంచిన తర్వాతే వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వస్తుందని వైద్యులు వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu