నా నిర్ణయం కరెక్ట్: సానియా కాన్ఫిడెన్స్

 

ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి తాను తీసుకున్న నిర్ణయం సరైనదిగానే భావిస్తున్నానని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తెలిపింది. ఇంచియాన్‌లో ముగిసిన ఆసియా క్రీడల్లో ఆమె ప్రార్థన తొంబారేతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేనీతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆసియా క్రీడలు ముగిసిన తర్వాత హైదరాబాద్‌కి చేరుకున్న సానియా తన నిర్ణయంలో ఎలాంటి తప్పూ లేదని ఆసియా క్రీడల్లో ఫలితాలే స్పష్టం చేస్తున్నాయని సానియా చెప్పింది. 2006లో లియాండర్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం, 2010 సంవత్సరంలో విష్ణువర్ధన్ భాగస్వామిగా మిక్స్‌డ్ డబుల్స్ రజత పతకాలను సాధించిన సానియా రెండు పతకాలను అందుకుంది. తాను సాధించిన ఈ ఫలితాలు తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని సానియా మీర్జా పేర్కొంది.