టీఆర్ఎస్ కు హైకోర్టు ఝలక్

 

ఉమ్మడి హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. టీఆర్ఎస్ సర్కారు పార్లమెంటరీ సెక్రటరీ పోస్టుల నియామకాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి టీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని, వెంటనే సెక్రటరీల పోస్టులను రద్దు చేయాలని ఆదేశించింది. తదుపరి నియామకాలు హైకోర్టు అనుమతితో జరపాలని ఆదేశించింది. దీంతో పార్లమెంటరీ సెక్రటరీలుగా బాధ్యతలు చేపట్టిన వినయ్ భాస్కర్, జలగం వెంకట్రావు, గాదరి కిశోర్ కుమార్, సతీశ్ కుమార్, కోవాల లక్ష్మి పదవులు కోల్పోనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu