అవిశ్వాసానికి మేము దూరం ...

తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడతామని ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెరాస రాజకీయ ఎత్తుగడలకు సాయపడకూడదని నిర్ణయించారు. జగన్ బెయిల్ కోసం బేరసారాలు నెరిపెందుకు వైఎస్సార్సీపీ, ప్యాకేజీలు మాట్లాదేకునేందుకు తెరాస ఇటువంటి డ్రామాలు ఆడుతోందని అన్నారు.  తోక పార్టీలను పట్టుకుని ఎందుకు వెళ్ళడం, రేపో  మాపో కాంగ్రెస్ లో విలీనం అయ్యే పార్టీలతో మనం ఎందుకు కలిసి వెళ్ళాలి? ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వం మెడలు వంచేందుకు పోరాడదాం. ప్రభుత్వం దిగిరాకపోతే అవిశ్వాస తీర్మానంపై సరైన సమయంలో సొంతంగా నిర్ణయం తీసుకుందాం అని చంద్రబాబు పార్టీ నేతలతో అన్నట్లు తెలిసింది. తెరాస, వైఎస్సార్సీపి రాజకీయ మనుగడ కోసమే ఇలాంటి ఎత్తుగడలను, బ్లాక్ మెయిల్, డ్రామాలు ఆడుతోందని దానికి తాము ఎందుకు సహకరించాలని పార్టీ ముఖ్యనేతలంతా భావిస్తున్నట్లు తెలిసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu