ఆస్పత్రి మీద నుంచి దూకి...

 

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి భవనం మీద నుంచి కిందకు దూకి శివప్రసాద్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శివప్రసాద్‌ మచిలీపట్నానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో గాంధీ ఆస్పత్రిలో ఒక్కసారిగా కలకలం రేగింది. శివప్రసాద్ దగ్గర ఏపీ టీవీ ఛాంబర్’కి చెందిన గుర్తింపు కార్డు లభించింది. శివప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. తీవ్ర అనారోగ్యం కారణంగా జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి వుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.