‘చంద్రన్న బీమా’ కేంద్రం నిధులతోనే నడుస్తోంది...

 

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే చంద్రబాబుపై ఓ రేంజ్ లో విరుచుకుపడిన వీర్రాజు తాజాగా మరోసారి చంద్రబాబుపై విమర్సలు గుప్పించారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదాపై ఒకరు డ్రామాలాడుతున్నారని, మరొకరు రాజీనామాలు చేస్తామంటున్నారని సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. ఏపీకి ఇచ్చిన హామీల్లో తొంభై శాతం నెరవేర్చామని, ఎన్నికలప్పుడు టీడీపీ ఇచ్చిన హామీల్లో పది శాతం కూడా నెరవేర్చలేదని, హామీల్లో భాగంగా చెప్పిన నిరుద్యోగ భృతి ఇంకా ఇవ్వడం లేదని విమర్శించారు. అంతేకాదు...కేంద్రం నిధులతోనే ‘చంద్రన్న బీమా’ నడుస్తోందని, గ్రామాల అభివృద్ధికి కేంద్రమే నిధులు ఇస్తోందని, ఈవిషయమై బహిరంగ చర్చకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.