వైసీపీ పై సోమిరెడ్డి జోస్యం.. అలా అయితేనే మనుగడ..

వైసీపీ పార్టీ అధినేత జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి జగన్ పై విమర్శల బాణాలు వదిలారు. నెల్లూరు జిల్లాలో జగన్ చేసిన పర్యటన ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని అన్నారు. అంతేకాదు వైసీపీ పార్టీ గురించి జోస్యం కూడా చెప్పారు. వరంగల్ ఉపఎన్నికలో వైసీపీ ఘోర పరాభవం పొందిన నేపథ్యంలో ఏపీలో కూడా వైసీపీ పరిస్థితి అదే అంటూ విమర్శించారు. దేశంలో కొత్తగా పుట్టిన ప్రాంతీయ పార్టీలు తాము ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో గెలిచి అధికారం సాధిస్తేనే మనుగడ సాధించాయని... అలా గెలవలేని పార్టీలన్నీ గంగలో కలిసిపోయాయని ఎద్దేవ చేశారు. మరి వైసీపీ గురించి సోమిరెడ్డి చెప్పిన జోస్యం నిజమవుతుందో లేదో వచ్చే ఎన్నికల బట్టి తెలుస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu