అమెరికాలో కాల్పుల కలకలం
posted on Jan 25, 2021 10:25AM
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఇండియానాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. ఓ ఇంట్లో దుండగులు కాల్పులకు పాల్పడడంతో గర్భిణీ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో మైనర్కి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అడమ్స్ స్ట్రీల్ 3500 బ్లాక్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు ముందస్తు ప్రణాళిక ప్రకారమే కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన చేశారు ఇండియానా పోలిసు మేయర్ జో హాగ్సెట్. ఈ దారుణ ఘటనపై పోలీసులు, ఇతర అధికారులు దర్యాప్తు ప్రారంభించారని వివరించారు. ఇది చాలా దారుణమైన ఘటన అని, దశాబ్ద కాలంలో ఇంతటి ఘోరమైన కాల్పులు చూడలేదని అక్కడి పోలీసులు తెలిపారు.