హైదరాబాద్ లో రాష్ట్రపతి 10 రోజుల విడిది

 

ప్రతీ ఏటా రాష్ట్రపతి వర్షాకాలం సమయంలో 10 రోజులపాటు దక్షిణాది రాష్ట్రాల విడిదిగా ఉన్న హైదరాబాద్ లోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో విశ్రాంతి తీసుకోవడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని పాటిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 10 రోజుల విశ్రాంతి నిమిత్తం ఈరోజు మద్యాహ్నం హైదరాబాద్ వస్తున్నారు. ఆయనకి ఆంద్రా, తెలంగాణా ముఖ్యమంత్రులు, గవర్నర్ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. ఆయన జూలై 1వ తేదీన తిరుపతి వెళ్తారు. జూలై 3వ తేదీన మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావు రచించిన ‘ఉనికి’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. క్రిందటిసారి ఆయన హైదరాబాద్ లో విడిది చేసినప్పుడు ఆంధ్రా, తెలంగాణా నేతలు రాష్ట్రవిభజన వ్యహరాలపై పిర్యాదులు చేసారు. ఈసారి కూడా అటువంటి పరిస్థితే నెలకొని ఉంది. ఆంద్రా, తెలంగాణా ప్రభుత్వాల మధ్య జరుగుతున్న యుద్ధం, సెక్షన్: 8 అమలు వంటి అనేక అంశాలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయనకి పిర్యాదులు చేసేందుకు బారులు తీరవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu