దసరా మాదిరి అమరావతి శంకుస్థాపన.. ప్రత్తిపాటి


 

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని దసరా రోజు అంటే అక్టోబర్ 22న నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ  శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ శంకుస్థాపనపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ దసరా రోజు జరిగే అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి లక్షమందిని ఆహ్వానిస్తున్నామని.. ప్రధాని నరేంద్ర మోడీతోపా టు సింగపూర్, జపాన్ ప్రధానులు కూడా విచ్చేస్తున్నారని.. ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధాని భూమిపూజ జరుగుతుందన్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి పదివేల గ్రామాల నుండి రైతులను ఆహ్వానిస్తున్నామని.. దసరా పండుగకి నవరాత్రులు ఉన్న మాదిరిగా ఈ నెల 13నుంచి 22వ తేది వరకు ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu