అమెరికా వరాహ పురాణం!

అమెరికాలోని కాలిఫోర్నియా పోలీసుల ముందుకు ఒక పెద్ద కేసు వచ్చింది. ఈ కేసుని పరిష్కరించాలని వాళ్ళు గత వారం రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇంతకీ పోలీసులని ముప్పుతిప్పలు పెడుతున్న ఆ కేసు ఏంటంటే, పదకొండు పందులకు ఓనర్ ఎవరో కనుక్కోవడం. కాలిఫోర్నియాలోని శాన్ డీగో కౌంటీలోకి వారం రోజుల క్రితం సడెన్‌గా ఒక తల్లి పంది తన సంతానమైన పది పిల్ల పందులతో ఈ కౌంటీలోకి వచ్చేసి సెటిలైంది. కౌంటీలో వాళ్ళందరూ ఈ పిగ్స్ ఫ్యామిలీని చూసి బిత్తరపోయారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పో్లీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ పంది ఫ్యామిలీ ఓనర్ ఎవరో కనుక్కునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎంత ఎంక్వయిరీ చేసినా ఈ వరాహ అవతారాల అసలు ఓనర్ ఎవరో మాత్రం అంతు చిక్కడం లేదు. దాంతో గత వారం రోజులుగా కాలిఫోర్నియా పోలీసులే ఈ పందుల బాధ్యతలు తీసుకుని, పోలీస్ స్టేషన్ పక్కనే ఈ పందులకు ఎకామిడేషన్ ఏర్పాటు చేశారు. వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. అదేంటో, కాలిఫోర్నియా పోలీసులు ఈ పందులతో ఎమోషనల్‌గా కూడా ఎటాచ్ అయిపోయారు.