నాకు బ్రతకాలని ఉంది.. మోడీకి లేఖ..

 

తనకు బ్రతకాలని ఉందని.. ప్రపంచాన్ని చూడాలని ఓ బాలుడు ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాశాడు. వివరాల ప్రకారం.. అంశ్ ఉప్పేటి అనే బాలుడు బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తనకు సహాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కి లేఖ రాశాడు. తనకు ఇప్పుడు 11 ఏళ్లని.. తనకు బ్రతకాలని ఉందని.. తన చికిత్స కోసం ఇప్పటికే తల్లి దండ్రులు ఇంటిని కూడా అమ్మేశారని లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా అల్లోపతి చికిత్స తీసుకోలేకపోతున్నట్లు, ప్రస్తుతం ఆయుర్వేద ఔషధాలు వాడుతున్నట్లు.. జబ్బు కారణంగా కుటుంబం రెండుపూటలా తినడం కూడా గగనమైపోతోందని ఆ బాలుడు తన లేఖలో పేర్కొన్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu