రాజన్ పై నోరు తెరిచిన మోడీ.. అంత ఆసక్తి అనవసరం
posted on May 27, 2016 2:40PM

ఆర్బీఐ గవర్నర్ రాజన్ పై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి గత కొద్ది రోజుల నుండి ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయనను ఆర్బీఐ గవర్నర్ గా తొలగించాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖ కూడా రాశారు. మరోవైపు ఈసారి కూడా ఆర్బీఐ గవర్నర్ గా రాజనే కావాలంటూ.. ఆయన ఉంటేనే వ్యవస్థకు మంచిది అంటూ కొంతమంది నెటిజన్లు కోరుతున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ నోరు తెరవని మోడీ ఇప్పుడు మొదటిసారి రాజన్ గవర్నర్ పదవిపై స్పందించారు. ఓ కార్యక్రమంలో రాజన్ గవర్నర్ పదవిపై ప్రభుత్వ నిర్ణయం ఏంటని ఆయనను అడుగగా.. ఇది పరిపాలనకు సంబంధించిన విషయం.. అయినా ఆయనకు ఇంకా సెప్టెంబర్ వరకూ సమయం ఉంది.. ఈలోగా ఏదో ఒకటి ఆలోచిస్తాం.. ఈ విషయంలో మీడియాకు అంత ఆసక్తి అనవసరం అని కాస్త గట్టిగానే చెప్పారు. మరి అప్పటిలోగా ఏం జరుగుతుందో చూడాలి.