అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ

 

హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన భారతీయ జనతాపార్టీ జాతీయ అమిత్‌ షాతో పవన్‌ కళ్యాణ్ భేటీ అయ్యారు. షాను పవన్ బేగంపేటలోని టూరిజం హోటల్‌లో గురువారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి బిజెపి, జనసేన మధ్య రహస్యమైన అవగాహన కుదిరిందని తెలుస్తోంది. మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయడంపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పవన్‌ కళ్యాణ్‌ సేవలను వినియోగించుకోవాలని బిజెపి, టిడిపి భావిస్తున్నాయి. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలలో జనసేన కూడా పోటీ చేసే అంశాన్ని కూడా పరిశీలించారని తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ రెండు రాష్ట్రాలకు సంబంధించి బిజెపి, జనసే మధ్య ఒక ప్రతిపాదన వచ్చిందన్నారు. ఆ ప్రతిపాదన ఏమిటో ఇప్పుడే చెప్పనన్నారు.