పాస్టర్ ప్రవీణ్ అనుమానా స్పద మృతి...  మాజీ ఎంపి హర్షకుమార్ పై కేసు 

 

గత నెల చివరి వారంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి చెందిన సంగతి తెలిసిందే.    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే  దర్యాప్తు దశలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే ప్రకటనలు ఒక్కోసారి దర్యాప్తు పక్కదారి పట్టిస్తాయి. కాంగ్రెస్ మాజీ ఎంపి హర్షకుమార్  కూడా దర్యాప్తు పక్కదారి పట్టే ప్రకటనలు చేశారు. పాస్టర్  పగడాల ను ఎవరో చంపి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారన్నారు. పైగా తన వద్ద బలమైన ఆధారాలున్నాయన్నారు. ఆధారాలు ఉన్నప్పుడు దర్యాప్తు అధికారికి ఆ అధారాలను సబ్మిట్ చేయకుండా ఆలస్యం చేయడం నేరం.  ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ కోణంలోనే హర్షకుమార్ ప్రకటనను చూస్తుంది. ఇప్పటికే నోరు జారిన హర్షకుమార్ పై పోలీసులు బిఎన్ ఎస్ 196, 197  సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ఆధారాలతో విచారణకు హాజరుకావాలని  హర్షకుమార్ కు నోటీసులు జారి చేశారు