నేటి నుంచే ప్యారిస్ ఒలింపిక్స్!

ఫ్యాషన్‌కి పుట్టిల్లు అయిన ప్యారిస్ నగరంలో నేటి నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. విశ్వక్రీడలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్యారిస్ నగరం సిద్ధమైంది. కరోనా మహమ్మారి ముప్పు తొలగిన తర్వాత నిర్వహిస్తున్న మెగా ఈవెంట్‌ ఇది. క్రీడా ప్రపంచానికి చిరకాలం గుర్తుండి పోయే విధంగా అత్యంత వైభవంగా ఆరంభ వేడుకలను నదిలో నిర్వహించాలని ఫ్రెంచ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో అత్యంత భారీ భద్రతా ఏర్పాట్లతో ఒలింపిక్స్ వేడుకలు జరగనున్నాయి. దాదాపు 45 వేల మంది రక్షణ బలగాలను వినియోగించనున్నారు. ఫ్రాన్స్‌ దేశం ఒలింపిక్స్.కిఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. తొలిసారి 1900 సంవత్సరంలో, రెండోసారిగా 1924లోజరిగాయి. ఇప్పుడు సరిగ్గా వందేళ్ళ తర్వాత ఫ్రాన్స్ ఒలింపిక్స్ నిర్వహిస్తోంది. అమెరికా (4సార్లు), బ్రిటన్‌ (3సార్లు) తర్వాత అత్యధికంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్న దేశంగా ఫ్రాన్స్‌ రికార్డులకెక్కనుంది. మొత్తమ్మీద 206 దేశాల నుంచి 10,500 మంది క్రీడాకారులు  ఈ క్రీడల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu