భారత్ కు పాక్ హెచ్చరిక.. యుద్ధానికి కాలుదువ్వితే తాము కూడా సిద్ధం..

 

ఇండియాకు ఎప్పుడూ పక్కలో బల్లెంలా ఉండే పాకిస్థాన్ మరోసారి భారత్ కు హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పాకిస్థాన్ అణు ఆయుధాలను పెంచుకుంటూ, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, ప్రభుత్వం అనుమతిస్తే, తాము పాక్ పై అణు యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పాక్ ను హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇక బిపిన్ రావత్ వ్యాఖ్యలపై స్పందించిన పాక్‌ విదేశాంగ మంత్రి ఖ్వాజా ముహమ్మద్‌ ఆసిఫ్‌ కఠిన వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్మీ చీఫ్ చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ తమను కవ్విస్తున్నాడని... అణు దాడికి ఇండియా తమకు ఆహ్వానం పంపుతోందని.. యుద్ధానికి కాలుదువ్వితే, తాము కూడా సిద్ధమేనని, భారత్ పై తీవ్ర స్థాయిలో అణు బాంబులు వేయగల సత్తా తమకుందని, ఈ విషయంలో రావత్ కు ఏమైనా అనుమానాలు ఉంటే, అవి త్వరలోనే తీరిపోతాయని అన్నారు.