ఈ ఏడాది ఇద్దరికి ఫిజిక్స్ నోబెల్!

ఫిజిక్స్.లో విశేష కృషి చేసినందుకు ఈ సంవత్సరం ఇద్దరికి నోబెల్ బహుమతి దక్కింది. జాన్ జె. హోప్ఫిల్డ్, జెర్రీ ఈ. హింటన్లకు ఈ ప్రతిష్ఠాత్కక పురస్కారం లభించింది. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్స్ మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలు చేసినందుకు ఈ అత్యున్నత పురస్కారం వీరిద్దరినీ వరించింది. గత సంవత్సరం ఫిజిక్స్.లో ఈ బహుమతి ముగ్గురిని వరించింది. పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల కదలికలను శోధించిన ఫ్రాన్స్ సైంటిస్ట్ పియర్ అగోస్తి, హంగేరియన్ సంతతి వ్యక్తి ఫెరెంక్ క్రౌజ్, ఫ్రాన్స్-స్వీడన్ శాస్త్రవేత్త యాన్ ఎల్ హ్యులియర్ ఈ బహుమతి అందుకున్నారు. 1901 నుంచి ఇప్పటివరకు 117సార్లు భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రకటించారు.

మెడికల్ విభాగంతో మొదలైన నోబెల్ బహుమతుల ప్రకటన అక్టోబర్ 14వరకు కొనసాగనుంది. నిన్న (సోమవారం) వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించగా.. నేడు (మంగళవారం) ఫిజిక్స్.లో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడించారు. బుధవారం కెమిస్ట్రీ, గురువారం లిటరేచర్ విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి విజేత, అక్టోబర్ 14న ఎకనామిక్స్ నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.

స్వీటన్ దేశానికి చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, బిజినెస్‌మన్ ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించారు. 1901 నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల అమెరికన్ డాలర్లు) నగదు అందుతుంది. ఈ బహుమతులను ఈ ఏడాది డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.