నిజాం సుగర్స్ జీఎం ఆత్మహత్య

 

నిజాం సుగర్స్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ శర్మ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో వున్న నిజాం సుగర్స్ కార్యాలయంలో ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. జీఎం శర్మ ఆత్మహత్య చేసుకుని వుండటాన్ని గమనించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. శర్మ మృతికి కారణాలు వ్యక్తిగతమా, ఫ్యాక్టరీకి సంబంధించిన వివాదాలు కారణామా అనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు శర్మ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శర్మ మృతి మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం వుందని నిజాం సుగర్స్ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu