నేపాల్ రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి: మోడీ

 

నేపాల్ త్వరగా రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని నేపాల్ అధ్యక్షుడు రాంభరణ్ యాదవ్, ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా తదితరులకు భారత ప్రధాని మోడీ సూచించారు. ‘నేపాల్‌కు వీలయినంత త్వరగా రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిన అవసరం ఉంది’ అని మోడీ వారికి చెప్పినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోబోదని మోడీ తన పర్యటనలో నేపాల్‌కు హామీ ఇచ్చారు. భారత ప్రధానమంత్రి మోడీ తన నేపాల్ పర్యటనను సోమవారం ముగించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునే కృషిలో భాగంగా నేపాల్‌కు వివిధ రకాల సహాయాన్ని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత 17 ఏళ్లలో నేపాల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోడీయే కావడం విశేషం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu