‘ఎన్’ కన్వెన్షన్ ఎందుకు కూల్చామంటే... రంగనాథ్ వివరణ!

సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్  ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. "తుమ్మడికుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలోని ఆక్రమణలను హైడ్రా, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. తుమ్మిడికుంటలోని అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటి. చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఒక ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్ పరిధిలోని 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. ఈ నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు లేవు. ఎల్ఆర్ఎస్ కింద అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ ప్రయత్నించింది. సంబంధిత అధికారులు ఎల్‌ఆర్ఎస్‌కి అనుమతించలేదు" అని రంగనాథ్ వివరించారు.