ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కుమారుడి అరెస్టు

ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ కుమారుడు జయసింహ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అలాగే పటాన్ చెరు ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదైంది. ఆయన తనపై దాడి చేశారంటూ ప్రవీణ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇలా ఉండగా చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఉదయం 9 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 7.78శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu