వాళ్ల ఉసురు కేసీఆర్ కు తగులుతుంది... మోత్కుపల్లి

తెలంగాణ తెదేపా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సీఎం కేసీఆర్ పై విమర్శల బాణాలు సంధించారు. హైదరాబాద్ కేసీఆర్ సొత్తు కాదని.. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పార్లమెంట్ నియమించిందని ఈ విషయంలో రాద్ధాంతం అనవసరం అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కడి వల్ల రాలేదని.. ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణను సాధించారని.. వాళ్లందరి ఉసురు ఇప్పుడు కేసీఆర్ కు తగులుతుందని ఎద్దేవ చేశారు. ప్రతిసారీ తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని.. ఆ సెంటిమెంట్ తోనే ఏదైనా చెయ్యోచ్చు అనుకుంటున్నారని మండిపడ్డారు.