మైనర్ బాలికపై అత్యాచారం.. కేజ్రీవాల్ పరామర్శ.. సోనియాగాంధీ కూడా..!

 

ఢిల్లీలో కొద్ది రోజుల క్రితం ఓ 13 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను రైల్వే ట్రాక్ పై పడేసి పారిపోయాడు. అయితే ప్రస్తుతం ఆ బాలిక ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ నేపథ్యంలో ఆమెను ఈరోజు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో నేరాలు బాగా పెరిగిపోయానని.. అవి అదుపులోకి రావాలంటే ప్రజలు, న్యాయాధికార సంస్థలు కలిసి పనిచేయాలని.. దానికి తగిన విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అంతేకాదు ఢిల్లీలో పూర్తిస్థాయి శాంతి భద్రతల అంశం ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండాలని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గంధీ కూడా బాలికను పరామర్శించడానికి ఎయిమ్స్ కు వెళ్లనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సంఘటన పట్ల స్థానిక మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేప‌ట్టాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu