చంద్రబాబు గురించి తెలుసుకుంటున్న.. ఒబామా

 

టీడీపీ యువనేత, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్యయకర్త లోకేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల సాకారం కోసం అమెరికాలో పర్యటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం అమెరికా అధ్యక్షుడు బరక్ ఒబామాను కలిశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టుపై, అమెరికన్ కంపెనీల సహాయంతో ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన ప్రాజెక్టుల గురించి లోకేశ్ ఒబామాకు వివరించారని తెదేపా పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ ప్రసాద్ తెలిపారు. తాను కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నానని ఒబామా తెలిపారని ప్రసాద్ చెప్పారు. అయితే లోకేశ్ ను కలవరాదని అమెరికాలోని కొన్ని తెలుగుసంఘాలు ఒబామాకు లేఖలు రాసిన ఆయన యువనేతను కలవడం విశేషం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu