బీజేపీ కార్యకర్త దారుణ హత్య..

 

కేరళలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో బీజేపీ కార్యకర్త మృతి చెందడంతో కేరళలో కలకలం రేగింది. వివరాల ప్రకారం.. కేరళలోని అండల్లూర్ లో సంతోష్ అనే వ్యక్తి ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో సంతోష్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పగా.. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంతోష్ ను ఆస్పత్రికి తరలించారు. కానీ సంతోష్ తీవ్రంగా గాయపడటంతో  ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. దాడి సమయంలో ఇంట్లో ఎవరూ లేరు.

 

మరోవైపు ఈ దాడి వెనుక సీపీఎం హస్తం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ హత్యను ఖండిస్తూ కన్నూరు జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. అయితే, బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను సీపీఎం ఖండించింది. సంతోష్ హత్యతో తమకు సంబంధం లేదని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.