జూన్ రెండు తరువాతే కేసీఆర్ పదవీ ప్రమాణం
posted on May 19, 2014 7:39AM
.jpg)
తెలంగాణాలో ఘనవిజయం సాధించిన తెరాస, తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకొని, అదేవిషయాన్ని గవర్నర్ నరసింహన్ కు నిన్న లికిత పూర్వకంగా తెలియజేసారు. పనిలోపనిగా తెలంగాణా అప్పాయింటడ్ డేట్ జూన్ రెండును ముందుకు జరపవలసిందిగా మరో మారు అభ్యర్ధించారు. అయితే ఆ విషయంలో తానేమీ చేయలేనని గవర్నర్ చెప్పినట్లు సమాచారం. అందువల్ల కేసీఆర్ కూడా జూన్ రెండు లేదా ఆ మరునాడే తెలంగాణా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయవచ్చును. కేసీఆర్ క్యాబినెట్లో ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, ఈటెల రాజేందర్ తదితరులకే కీలకమయిన మంత్రి పదవులు దక్కుతాయని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కేసీఆర్ కుమార్తె కవిత లోక్ సభకు పోటీ చేసినందున ఆమె కేసీఆర్ మంత్రివర్గంలో చేరకపోవచ్చును. కానీ ఆమెను కేసీఆర్ తన మంత్రి వర్గంలో చేర్చుకొన్నా ఆశ్చర్యం లేదు.