జమ్ము - కాశ్మీర్ వరదలు.. తెలుగు విద్యార్థి గల్లంతు...

 

జమ్ము - కాశ్మీర్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ రాష్ట్రానికి విహార యాత్రకు వెళ్ళిన దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన పర్యాటకులు చిక్కుకుపోయారు. వీరిలో 60 మంది తెలుగు వాళ్లు కూడా వున్నారు. శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంతంలో కూడా భారీగా వరద నీరు చేరుకుంది. ఈ విద్యా సంస్థలో చదువుతున్న అనంతపురం జిల్లా కొత్తచెరువు ప్రాంతానికి చెందిన ముఖేష్ అనే విద్యార్థి వరద నీటిలో పడి గల్లంతు అయినట్లు తెలిసింది. దాంతో ముఖేష్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.