ముఖ్యమంత్రి ఇంటిపై సీఐడీ దాడి
posted on Sep 26, 2015 4:50PM

ఆదాయానికి మించి ఆస్తుల ఎక్కువగా ఉన్నాయన్న ఆరోపణల కింద హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఇంటిమీద సీబీఐ, ఈడీ అధికారులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో వీరభద్ర సింగ్ (80), ఆయన భార్య ప్రతిభా సింగ్, కొడుకు విక్రమాదిత్య, కుమార్తె అపరాజితల మీద సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. వీరభద్ర సింగ్ 2009 నుండి 2011 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈనేపథ్యంలోనే ఆయన అనేక అవినీతి ఆరోపణలకు పాల్పడి రూ. 6.1 కోట్ల ఆస్తులు సమకూర్చుకున్నారని దీనికి సంబంధించిన ఆధారాలు మాదగ్గర ఉన్నాయని అధికారులు తెలిపారు. అంతేకాదు వీరభద్ర సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లంచాలు తీసుకున్నారని.. మనీ లాండరింగ్, ఫోర్జరీ తదితర ఆరోపణలు కూడా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో పాటు న్యూఢిల్లీ లోని 11 ప్రాంతాలలో సోదాలు జరిపి విలువైన డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.