అగ్రిగోల్డ్ పై హైకోర్ట్ ఫైర్.. 15 రోజుల్లో స్టార్ట్ చేయాలి..

అగ్రిగోల్డ్ కుంభకోణంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా హైకోర్టు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ వల్ల ఎంతో మంది నష్టపోయారని.. లక్షలాది మంది బాధితులకు సంబంధించిన ఈవిషయంలో ఏపీ సర్కారు ఏం చేస్తుంది అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఈ కేసు విచారణాధికారిని తక్షణమే మార్చాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సీఐడీ పై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ ఇప్పటివరకూ ఎంతమందిని ప్రశ్నించింది? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు.. రెండు నెలలుగా ఎవరనీ ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలాన్ని 15 రోజుల్లో స్టార్ట్ చేయాలని ఆదేశించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu