గవర్నర్ కు ఢిల్లీ నుండి పిలుపు

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఓటుకు నోటు కేసు నేపథ్యంలో మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ కేసు వ్యవహారంపై ఢిల్లీ నుండి పిలుపు రాగా ఈరోజు సాయంత్రం అత్యవసరంగా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ఉదయం హోంశాఖ అధికారులతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. రోజు రోజుకి ఓటుకు నోటు కేసు వ్యవహారంపై వివాదాలు పెరుగుతుండటం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ విషయం.. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన నివేదికి గవర్నర్ కేంద్రానికి సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. గవర్నర్ ఢిల్లీ పర్యటన తరువాత ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఇప్పుడు అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu