సెక్షన్ 8 అమలు చేయండి.. లేకపోతే యూటీ చేయండి.. గంటా

ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలంగాణ ప్రభుత్వం వైఖరిపై ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో ఎంత తొందరగా సెక్షన్ 8 అమలు చేస్తే అంత మంచిదని.. లేకపోతే హైదరాబాద్ ను యూటీ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు పై ఇప్పటికే గవర్నర్ కు చెప్పామని.. ఇప్పటికి 23 సార్లు గవర్నర్ ని కలిశామని.. అయినా గవర్నర్ మాత్రం ఈ విషయంపై ఇంకా నాన్చుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి చిన్న విషయానికి వితండవాదం చేస్తుందని.. తమ వైఖరిని ఇప్పటికైనా మార్చుకుంటే మంచిదని అన్నారు. ఎన్ని చేసినా ఇప్పటి వరకు సహించామని.. ఇక నుండి సహించేది లేదని మేము కూడా తిరిగి పోరాడతామని ఘాటుగా వ్యాఖ్యానించారు.