హైదరాబాద్ రావాలంటే టీఆర్ఎస్ పర్మిషన్ కావాలా? బీజేపీదే గ్రేటర్ పీఠమన్న గరికపాటి

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు బీజేపీ సీనియర్ నేత గరికపాటి మోహన్‌రావు. బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ పర్మిషన్ తీసుకుని హైదరాబాద్ రావాలా? అని ప్రశ్నించారు. గ్రేటర్ మేయర్ పీఠాన్ని బీజేపీ గెలవబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా వస్తున్నాయన్నారు. గ్రేటర్ ఫలితం తర్వాత తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకుల దృష్టి మరింత పెరుగుతుందని , వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఖాయమని చెప్పారు గరికపాటి మోహన్‌రావు.

ఆరేండ్లలో కేసీఆర్ చేసిన అవినీతితో తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు గరిక పాటి మోహన్ రావు. బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో ముందు టీఆర్ఎస్ ప్రణాళిక తేలిపోయిందని కామెంట్ చేశారు. ఎంఐఎంకు ధీటైన జవాబు చెప్పగలిగేది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లపై చేయి వేస్తే ఏమవుతుందో ఎంఐఎంకు అర్థం కావట్లేదని గరికపాటి మోహన్‌రావు హెచ్చరించారు. వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్రలు నివేదికలు పంపలేదని విమర్శించారు.