విజయవాడలో దారుణం.. ఐదుగురి అనుమానాస్పద మృతి

విజయవాడలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదండగా మరణించారు. ఆర్థోపెడిక్ నిపుణుడైన డి.శ్రీనివాస్  ఇంటి బయట చెట్టుకు ఉరి వేసుకుని మరణించగా, ఇంటి లోపట శ్రీనివాస్ తల్లి రమణమ్మ, భార్య ఉష, ఇద్దరు పిల్లలు శైలజ, శ్రీహాన్ రక్తపు మడుగులో పడి వున్నారు. డాక్టర్ డి.శ్రీనివాస్ విజయవాడలో శ్రీజ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి నగరంలోని గురునానక్ కాలనీలో నివసిస్తున్నారు. కాగా, కుటుంబ సభ్యులను శ్రీనివాసే హత్య చేసి వుంటాడని, ఆ తర్వాత ఉరి వేసుకుని వుంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.