ఆధార్ అనుసంధానం.. ఓటు తొలగించం

 

ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తున్నామని.. ఒకవేళ ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం లేకపోయినంత మాత్రాన ఓటు తొలగించబోమని తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అన్నారు. కరీంనగర్ లోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం పూర్తిచేస్తామని.. ఆగష్ట్ 15 లోపు ఈ అనుసంధానం పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణలో తెలంగాణలో ఇప్పటికి వరకు 80శాతం అనుసంధాన ప్రక్రియ పూర్తి చేశామని నిజామాబాద్‌ జిల్లాలో వందశాతం అనుసంధానం పూర్తయిందని భన్వర్‌లాల్‌ తెలిపారు. ఆధార్ అనుసంధానం మొబైల్‌పాయింట్ల ద్వారా చేసుకోవచ్చని ఆయన వివరించాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu