తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (అక్టోబర్6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం (నవంబర్5) శ్రీవారిని 78వేల 389 మంది దర్శించుకున్నారు.

వారిలో 23వేల 466 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 87లక్షల  రూపాయలు వచ్చింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu