శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

వారాంతం కావడంతో తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అధికంగా ఉంది. శనివారం(జూలై15) శ్రీవారిని 87 వేల 171 మంది దర్శించుకున్నారు. 38వేల 273 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

హుండీ ఆదాయం 3.68 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది.

టోకెట్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu