శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అధికంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.

గురువారం శ్రీవారిని మొత్తం 67 వేల 300 మంది దర్శించుకున్నారు.  32 వేల 802 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3.83 కోట్ల రూపాయలుగా ఉంది.

శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu