తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (మార్చి 29) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 9 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక టైమ్ స్లాట్ దర్శనానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్నవారికి స్వామివారి దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం స్వామి వారిని మొత్తం 65 వేల 569 మంది దర్శించుకున్నారు. వారిలో  21 వేల 780 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 15 లక్షల రూపాయలు వచ్చింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu