తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

వేంకటేశ్వరుని దర్శనం కోసం వస్తున్న భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది.

శుక్రవారం (జులై 5) ఉదయం శ్రీవారి భక్తుల కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిడిపోయాయి. దీంతో భక్తుల క్యూలైన్ ఏటీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక గురువారం (జులై 4) శ్రీవారిని మొత్తం 63వేల 826 మంది దర్శించుకున్నారు. వారిలో 27వేల 530 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 23 లక్షలు వచ్చింది.